Tuesday, October 28, 2008

మనిషి

చలికి తట్టుకోలేక రాళ్ళు
మంచుదుప్పటే
కప్పుకున్నై

వాన ఉధ్రుతి చూచి
ప్రతితరువూ
ఆనందంతో
తలలూస్తొంది
ఎండ వేడికి తాళలేక
పురుగు, పుట్రా సైతం
సమైక్యంగా దాగి
చల్లని సాయంకాలనికై
ఎదురు చూస్తున్నై

స్వార్థపు దుప్పటీ కప్పుకుని
కుటిలపు ఆలొచనలతో
క్రుతిమపు చల్లదనంలో
విక్రుత మైన ఊహలలో
చల్లని సాయంత్రాన్ని సైతం
మరిచే పొయాడు మనిషి


జయభారతి సుసర్ల

No comments: